ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హస్తినకు వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రముఖులను కలుస్తున్నారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
అలాగే జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా గుంటూరులో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆయన నివాసంలో సోము వీర్రాజు కలిశారు. అనంతరం ఇద్దరు కలిసి కన్నా నివాసంలో భోజనం చేశారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు వెల్లడించారు.