అమరావతి.. జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తాజాగా జరుగుతున్న కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రచారంపై స్థానిక డీ ఎస్పీ విధించిన ఆంక్షలను ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. తన అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఇచ్చిన సర్కులరును కొట్టేసింది ఏపీ హైకోర్టు. డీఎస్పీ సర్కులర్, ఎన్నికల ఆంక్షలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది.
ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులను కాల రాస్తున్నారని, హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ పోసాని. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు పులివర్తి నాని, నిమ్మల రామానాయుడు, మునిరత్నం, అమర్నాధ్రెడ్డి ప్రచారానికి ఆటంకాలు కల్పించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారం చేసుకోవడం వారి హక్కని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో జగన్ సర్కార్కు షాక్ తగిలినట్లయింది.
జగన్ పాదయాత్రల్లో అరెస్టులు జరిగాయా?: అశోక్ గజపతిరాజు