ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. కరోనా సంక్షోభం వల్ల తలెత్తిన పరిస్థితుల వల్ల అల్లాడిపోతోన్న ప్రజలపై మరింత భారం మోపారని అన్నారు. పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం రూ.4కి పెంచడం తగదన్నారు.
మోపెడ్ నడిపే సామాన్యుడిపై, ఆయిలింజన్ ఉపయోగించే సన్నకారు రైతుపై, బెంజ్ కారు వాడే ధనవంతుడిపైనా ఒకేలా పన్ను పెంపు న్యాయమా? అని ప్రశించారు. ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడే ప్రమాదముందని విమర్శించారు. ఓ వైపు ధరలు మరోవైపు పన్ను పెంచి కరోనా కాలంలో ప్రజలను మరింత కష్టాలకు గురిచేయడం దారుణమని వ్యాఖ్యానించారు. పెంచిన వ్యాట్ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని