telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కడప జిల్లాలో పేలుడు.. 10 మంది కూలీలు మృతి

కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఆ జిల్లాలోని పొరుమామిళ్ల మండలం మామిల్లపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్వారీలో ముగ్గురాయి వెలికితీత పనులకు వెళ్లిన కూలీలు…వెలికితీత సమయంలో ఒక్కసారిగా పేలుడు పదార్థాలు పేలాయి. దీంతో అక్కడికక్కడే 10 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు….క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Related posts