telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

ఈ బ్యాంకుల్లో లిమిట్ దాటితే ఛార్జీల మోతే…!

Bank

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. బ్యాంక్‌లో ఖాతా కలిగి ఉండటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అయితే బ్యాంక్ అకౌంట్ వల్ల ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రతికూలతలు కూడా ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు చార్జీలు భారం కూడా భరించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు అయితే నిర్ణీత పరిమితి దాటిన తర్వాత డబ్బులు డిపాజిట్ చేయాలని చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంక్ నెలలో ఎనిమిది వరకు ఏటీఎం లావాదేవీలకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. వీటిల్లో ఐదు ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో నిర్వహించొచ్చు. మిగతా మూడు ఇతర బ్యాంకుల ఏటీఎంలో వినియోగించుకోవచ్చు. ఈ లిమిట్ దాటిన తర్వాత బ్యాంక్ క్యాష్ ట్రాన్సాక్షన్లకు రూ.20 చార్జీ వసూలు చేస్తోంది. అదే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి అయితే రూ.8.5 తీసుకుంటోంది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర అయితే క్యాష్ విత్‌డ్రాయెల్, డిపాజిట్ లావాదేవీలపై కూడా చార్జీలు విధిస్తోంది. నెలలో తొలి మూడు లావాదేవీలు ఉచితం. ఈ లిమిట్ దాటిన తర్వాత ట్రాన్సాక్షన్‌కు రూ.100 వరకు వసూలు చేస్తోంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్ ఈసీఎస్ ట్రాన్సాక్షన్లకు రూ.25 చార్జీ తీసుకోనుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా నెలలో 4 క్యాష్ ట్రాన్సాక్షన్లను ఉచితంగా అందిస్తోంది. ఈ లిమిట్ దాటిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా లేదంటే తీసుకోవాలన్నా చార్జీలు చెల్లించుకోవాలి. రూ.1000కు రూ.3.5 లేదా ట్రాన్సాక్షన్‌కు రూ.150 వరకు చార్జీలు విధిస్తోంది.

Related posts