కర్ణాటకలోని అడవుల గురించి, అక్కడి జంతుజాలం గురించి వివరిస్తూ రూపొందిన `వైల్డ్ కర్ణాటక` కార్యక్రమానికి విలక్షణ నటుడు ప్రకాష్రాజ్ గాత్రం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ప్రకాష్రాజ్ స్వరం వినిపించనుంది. `వైల్డ్ కర్ణాటక` పేరుతో డిస్కవరీ ఛానెల్లో ఈ కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది. ఆ కార్యక్రమం ట్రైలర్ను ప్రకాష్రాజ్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు సూపర్స్టార్ మహేష్ బాబు, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ను రీ-ట్వీట్ చేసిన మహేష్.. `ప్రకాష్రాజ్ గాత్రంలో ఆ కార్యక్రమం ఎలా ఉంటుందో చూడడానికి ఆసక్తిగా ఉన్నా`నని ట్వీట్ చేశాడు. ఇక అనసూయ `ఆహా! చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది మంచి కార్యక్రమం. విజువల్స్, వాటికి ప్రకాష్రాజ్గారి వాయిస్ నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా` అంటూ అనసూయ కామెంట్ చేసింది.
Looking forward to your interesting narrative !! @prakashraaj way to go… https://t.co/aPNpGqjF8A
— Mahesh Babu (@urstrulyMahesh) May 26, 2020
కేంద్ర మంత్రిపై ఫైర్ అయిన హీరో