telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రోగులను తీసుకొస్తే.. వేలల్లో బహుమతులు ప్రకటించిన ఆసుపత్రి… చిక్కుల్లో పడింది..

hospital marketing viral got punishment

ఇప్పటివరకు మార్కెటింగ్ ఇల్లు, వస్తువులు తదితర అమ్మకాలలో కనిపించింది. తద్వారా ఆయా మార్కెటింగ్ చేసే వ్యక్తులకు భుక్తి కోసం ఎంతో కొంత నగదు ముడుతుంది. ఇదే తరహా మార్కెటింగ్ ఇప్పుడు సేవవిభాగం లో కూడా కనిపిస్తుంది.. తాజాగా ఓ ఆసుపత్రి అదే తరహా పని ప్రారంభించింది. ఆ ప్రకారం, మా ఆసుపత్రికి నెలకు ఐదుగురు రోగులను పంపిస్తే రూ.1,000 గిఫ్ట్‌కార్డు, 10 మందికి 2,000, 15కు 3,000, 25 మందికి 6,000 గిఫ్ట్‌కార్డు ఇస్తామంటూ.. రాజమహేంద్రవరంలోని ‘ఏస్‌’ ఆసుపత్రి యాజమాన్యం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మెడికల్‌ ప్రాక్టీషనర్లకు ఆఫర్లను ప్రకటించింది.

ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ జరిపి ఆసుపత్రిని మూసివేయించారు. ఆ ఆసుపత్రి వైద్యులు నిఖిల్‌ నుంచి వివరణ తీసుకున్నారు. వైద్య వృత్తిని దిగజార్చేలా ఉన్న ఆ ప్రకటన అనైతికమైనందున నోటీసు ఇవ్వనున్నట్లు వైద్య మండలి ఛైర్‌పర్సన్‌ సాంబశివారెడ్డి వెల్లడించారు.

Related posts