డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో “జేమ్స్ బాండ్” 25వ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘నో టైమ్ టు డై’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే ఈ చిత్ర కథ ఉండబోతోందని సమాచారం. బాండ్ 25 చిత్రానికి ఆ మధ్య పలు సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కానీ అందుకు ఒక్క కండీషన్ పెట్టారు. సినిమాను ఓటీటీలో విడుదల చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ వారు ఓ అగ్రిమెంట్ చేయాలి. దానికోసం ఓ భారీ మొత్తం చెక్ రూపంలో ఇవ్వాలని చిత్ర బృందం కోరింది. ఈ సినిమా కోసం ఎంతో మంది వేచిచూస్తున్నారు. దాంతో ఎటువంటి నష్టాలు రావని చిత్ర యూనిట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా బ్యానర్ వారు ఓటీటీ డీల్ కోసం 600 మిలియన్ డాలర్లు కాట్టాలని అన్నారు. దీంతో అతికొద్ది ఓటీటీ ప్లాట్ ఫార్మ్ వారు మాత్రం ఇన్ట్రస్ట్ చూపుతున్నారు. డానియల్ నటించనున్న జేమ్స్ బాండ్ సిరీస్లో ఇదే చివరిది.
previous post
నగ్నంగా నిలబడ్డా… నేను యాంకర్ సుమలా కాదు… అనసూయ కామెంట్స్