కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో సోషల్ మీడియా ద్వారా అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా నటసింహ నందమూరి బాలకృష్ణ సోదరి, బావ కలిసి వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి కలిసి వంటగదిలో పోటీ పడి మరీ రకరకాల నాన్ వెజ్ వెరైటీలు వండారు. ఈ వీడియోకు ‘ఉలవచారు బిర్యానీ’లోని ‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా’ పాటను బ్యాగ్రౌండ్లో వాడారు. బిర్యానీ, నాటుకోడి పులుసు వండిన తర్వాత పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు కలిసి కాసేపు మనవరాలిని ఆడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వంటగదిలో బాలయ్య సోదరి పురంధేశ్వరి, బావ వెంకటేశ్వరరావు సరదాగా గరిటె తిప్పుతున్నారు.. pic.twitter.com/xDRQI9JxFj
— Y.Chandra Sekhar (@chandra99997) April 13, 2020


ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం… బాలకృష్ణ వ్యాఖ్యలపై సి.కళ్యాణ్