కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు సినీ తారలు. ముఖ్యమంత్రి సహాయ నిధులకు తమ వంతు బాధ్యతగా భారీ విరాళాలు అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కలిపి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు పీఎం రిలీఫ్ ఫండ్కు మరో కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, నితిన్ 10 లక్షల రూపాయలు, దర్శకుడు త్రివిక్రమ్ రూ. 20 లక్షలు, దర్శకుడు అనిల్ రావిపూడి రూ. 10 లక్షలు, దిల్ రాజు రూ.10 లక్షలు ప్రకటించగా.. ఇప్పుడు వీళ్ల జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేరారు. సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు ప్రకటించగా ప్రభాస్ మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో రూ. 4 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
previous post
నాగబాబుకు శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్…!