కళ్యాణి తెలుగులో నటించిన మొదటి మూవీ ‘శేషు’. ఆ సినిమాలో నటనతో ఆడియెన్స్ను ఇంప్రెస్ చేశారు. ఆ తర్వాత ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు సొంతం చేసుకున్నారు. నటుడు జగపతిబాబు, కళ్యాణి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు విజయాలు సాధించాయి. ప్రస్తుతం కళ్యాణి దర్శకురాలిగా మారబోతున్నారు. కే2కే ప్రొడక్షన్స్ బ్యానర్పై వాస్తవ ఘటనల ఆధారంగా విలక్షణ ప్రేమకథతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. హోలీ సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్ను టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది.
previous post