సోషల్ మీడియాలో రోజు రోజుకు చిరంజీవిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహామ్మారిని అరికట్టడానికి కేంద్రం మే 3 వరకు లాక్డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా అత్యవసర సేవలు చేసే పోలీస్, హాస్పిటల్,మీడియా, మున్సిపల్, ఫైర్ వంటి కొన్నింటికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. మిగిలిన వారందరు ఇంటి పట్టునే ఉన్నారు. లాక్డౌన్లో సందర్భంగా ఇంట్లోనే ఉంటూ కుటంబ సభ్యులతో కలిసి అభిమానులకు సందేశం ఇస్తున్నారు. తాజాగా చిరంజీవి ఇంట్లో గార్డెన్ పని చేస్తూ బిజీగా ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
The paths we take should always be clean #LockdownActivities #StayHomeStaySafe pic.twitter.com/7Ie4frsTut
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 16, 2020