ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, తమ ప్రాథమిక నివేదికను పోలీసు అధికారులకు అందించారు. పాయిజన్ వల్లే మారుతీరావు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గారెల్లో పాయిజన్ పెట్టుకుని తినడం వల్లే అతను చనిపోయాడని రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ మేరకు పోస్ట్మార్టం రిపోర్ట్లో వైద్యులు ధృవీకరించారు. మారుతీరావు శరీరంపై ఎటువంటి గాయాలూ లేవని తెలిపారు.
పాయిజన్ శరీరం మొత్తం వ్యాపించడంతో అవయవాలు పనిచేయకుండా ఆగిపోయాయని, రక్తప్రసరణ కూడా ఆగిపోవడంతో బ్రెయిన్ డెడ్ అయిందన్నారు. అంతేకాకుండా కార్డియాక్ అరెస్ట్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఫలితంగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోయి ఉంటాయని తమ పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
ఫ్రీ భోజనం కోసమే ప్రెస్ మీట్లకు..జర్నలిస్టులపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు