సీఏఏ అనుకూల, వ్యతికేక వర్గాల మధ్య అల్లర్లతో అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. పౌరులు రోడ్ల మీదకు వస్తున్నారు. అయితే, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు గుంపులుగా తిరగడం, సమావేశాలు ఏర్పాటు చేయడంపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ప్రజలు ఉద్యోగాలు, కార్యాలయాలకు వెళ్తున్నారని, ట్రాఫిక్ కూడా సాధారణంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అల్లర్లలో కాలిపోయిన కార్లు, ఇతర వాహనాలతో పాటు రోడ్లపై పోగైన చెత్తను భారీ క్రేన్లు, బుల్డోజర్ల సాయంతో తొలగిస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో పోగైన చెత్త, శిథిలాలను ఈశాన్య ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు తొలగించిందని హోం శాఖ తెలిపింది.హింస కారణంగా అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు మరికొంత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.
అవసరమైతే రోడ్డుపై పడుకుంటాను.. బెదిరింపులకు భయపడను: చంద్రబాబు