telugu navyamedia
రాజకీయ వార్తలు

పోలీసు విభాగాలకు సాంకేతిక సాయం పెంచుతాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

kishan reddy minister

పోలీసు విభాగాలకు సాంకేతిక సాయం పెంచుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర హోం శాఖలోని అంతర్గత శాఖను తనకే అప్పగించారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యల విభాగాన్ని ప్రభుత్వం తనకే అప్పగించిందని చెప్పారు.

జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాల్లోని ఉగ్రవాద ముఠాలపై తీసుకోవాల్సిన చర్యల పై పోలీసు శాఖతో చర్చిస్తానన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని శాంతిభద్రతలపై త్వరలోనే సమీక్షిస్తామని అన్నారు. పోలీసు శాఖను ఆధునికీ కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశాల్లో ఉన్న విధానాలు తెలుసుకుని పోలీసు శాఖను ఆధునికీకరిస్తామని స్పష్టం చేశారు.

Related posts