అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో ‘వచ్చేస్తున్నా’ అంటూ విమానంలోంచి హిందీలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇండియాలో అడుగుపెట్టాలని ఎదురు చూస్తున్నామని, దారిలో ఉన్నామని, కొన్ని గంటల్లో అందరినీ కలుస్తామని ఆయన చెప్పారు.
ఇక ఆయన హిందీలో చేసిన ట్వీట్పై వెంటనే స్పందించిన ప్రధాని మోదీ ‘అతిథి దేవోభవ’ అంటూ హిందీలోనే రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. ట్రంప్తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్ అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్..మసిబూసిన మారేడుకాయ: చంద్రబాబు