ఏపీ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను జగన్ వెనక్కి తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న జగన్ పాలనాపరమైన విధులు నిర్వర్తించాల్సి ఉండడంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్లో తప్పులు దొర్లాయని పేర్కొన్న జగన్ తరపు న్యాయవాదులు.. వాటిని సరిదిద్దిన అనంతరం తిరిగి పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో నిన్నటి విచారణకు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉండగా ఆయన కోర్టుకు రాలేదు. జగన్ తరపు న్యాయవాది వేసిన ఆబ్సెంట్ పిటిషన్ను అనుమతించిన సీబీఐ కోర్టు కేసు తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.