ఇటీవల కాలంలో యువతులపై దాడులు ఎక్కువవుతున్నాయి. దిశ ఘటన తరువాత కూడా మృగాళ్లలో ఎలాంటి మార్పు కన్పించడం లేదు. తాజాగా ముంబై నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు వచ్చిన ఇద్దరు మోడల్స్పై కొందరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు వారిపై దాడి చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో దాడికి పాల్పడినవారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్నేహితుల బర్త్ డే పార్టీ నుంచి ఇద్దరు మోడల్స్ తిరిగివస్తూ, నాదరా బస్టాండ్ సమీపంలోని ఒక రెస్టారెంట్కు వెళ్లారు. అయితే అక్కడున్న అల్లరిమూక ఆ మోడల్స్పై అశ్లీలంగా కామెంట్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆ మోడల్స్ వారిని వారించారు. వెంటనే రెచ్చిపోయిన ఆ యువకులు మోడల్స్ను కొట్టడం ప్రారంభించారు. ఈ సమయంలో అక్కడున్నవారంతా గొడవను ఆపేందుకు బదులు వీడియోలు తీయడంలో మునిగిపోయారు. కాగా ఆ మోడల్స్ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది.
next post