సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం “సైరా నరసింహారెడ్డి”. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానున్న “సైరా” చిత్రంలో చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ చిత్రంగా సైరా రూపొందగా, ఈ ప్రాజెక్ట్ కోసం 280 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని ఇన్సైడ్ టాక్. చిరంజీవి రెమ్యునరేషన్ కాకుండా అంత మొత్తం ఖర్చు చేసారని చెబుతుండగా, సినిమా లాభాలలో మెగాస్టార్ వాటా పుచ్చుకుంటాడని అంటున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగగా, కొణిదెల ప్రొడక్షన్ బేనర్పై రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించిన విషయం విదితమే. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సినిమా సిద్ధంగా ఉంది. సెన్సార్ నుంచి ఒక్క కట్ కూడా లేకుండా యుబైఏ సర్టిఫికెట్ను ఈ చిత్రం పొందింది. దీనికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. అయితే ఈ సినిమా నిడివి 2గంటల 50 నిమిషాల 50 సెకన్లు ఉన్నట్లుగా సెన్సార్ సర్టిఫికెట్ చూపిస్తుంది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు రెండున్నర గంటలు మించడం లేదు. చిత్ర జయాపజయాల విషయంలో నిడివి గురించి కూడా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటిది దాదాపు 3 గంటల ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
#SyeRaa Censored with ‘UA’ Certification and a run-time of 2 Hrs 50 Mins
All set for the Grand Release on October 2nd! #SyeRaaNarasimhaReddy #SyeRaa #SyeRaaOnOct2nd @KonidelaPro Megastar #Chiranjeevi #RamCharan @DirSurender pic.twitter.com/83i90SOUf5
— BARaju (@baraju_SuperHit) September 26, 2019