telugu navyamedia
సినిమా వార్తలు

సెప్టెంబ‌ర్ 29న సంతోషం సౌతిండియా అవార్డ్స్ ప్రదానం

Santhosham

సెప్టెంబ‌ర్ 29న ఈ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ క్రమంలో సంతోషం సౌతిండియా 17వ అవార్డ్స్ కర్టెన్‌ రైజర్‌ను బుధ‌వారం రాత్రి నిర్వ‌హించారు. ఈ వేడుకకు ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నభా నటేష్‌, బర్నింగ్‌ స్టార్‌ సుంపూర్ణేష్‌ బాబు అథితులుగా విచ్చేశారు. పాపులర్‌ సింగర్‌ సింహా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రతి ఏటా జరిగే సంతోషం అవార్డ్స్‌ వేడుకలో భాగంగా ద‌క్షిణాదిన విడుద‌లైన చిత్రాల‌కు, న‌టీన‌టులు,సాంకేతిక నిపుణుల‌కు ఈ అవార్డుల‌ను అందిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో నభానటేశ్‌.. అవార్డు ఫంక్షన్‌ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “సంతోషం 17వ సంత్సరం అవార్డుల్లో నేనూ పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం నేను కూడా పెర్ఫామ్ చేస్తున్నాను. సురేష్‌గారికి చాలా చాలా థ్యాంక్స్‌” అన్నారు. రామ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటించిన “ఇస్మార్ట్ శంకర్” ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

Related posts