ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, నటీనటుల కడసారి చూపు కోసం గురువారం మధ్యాహ్నం ఫిల్మ్ఛాంబర్కు తీసుకొచ్చారు. ఛాంబర్లో వేణుమాధవ్ పార్థివ దేహానికి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. వేణుమాధవ్ కడసారి చూపు కోసం భర్తతో కలిసి ఛాంబర్కు వచ్చిన సీనియర్ యాంకర్ ఉదయభాను కన్నీటి పర్యంతమయ్యారు.
వేణు తనకు సోదర సమానుడని, తనను చెల్లెలిలా చూసుకునేవాడని అన్నారు. వాళ్లిద్దరూ కలిసి చేసిన టీవీ షోలలోనటించిన విషయాన్ని గుర్తుచేసుకుంది. వేణు మాధవ్ చాలా హుషారుగా, అందరినీ నవ్విస్తూ ఉండేవాడని గుర్తుచేసుకున్నారు. ఎవరై ఆపదలో ఉన్నా వెంటనే చలించే మనిషి అని కొనియాడారు. వేణు అన్న లేకపోవడం సినీ ఇండస్ట్రీకి పెద్దనష్టం అని అన్నారు.