టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసం పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండవల్లి కరకట్టపై ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉండటంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఏదైనా ఒక ఇంట్లో అద్దెకు ఉంటే, అక్కడ నిబంధనల ప్రకారం ఏదైనా కట్టలేదని తెలిస్తే.. నేను అయితే అలాంటి ఇంట్లో ఉండను అని తెలిపారు.
అప్పుడు చంద్రబాబు ఉన్నారు, ఇప్పుడు ఖాళీ చేయాలి. దాని గురించి ఇంత చర్చ ఏంటని ప్రశ్నించారు. ఆ ఇంటిని ప్రభుత్వం కనుక పడగొడితే సానుభూతి వస్తుందని చంద్రబాబు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇంటి గురించి లేదా రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నాయన్న ఆరోపణలపైనా మాట్లాడటమే పనిగా ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ దొందూదొందేనని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
ప్రభుత్వ ప్రకటనల్లో తప్పుడు సమాచారం: లోకేశ్