యాదాద్రి వివాదం నేపథ్యంలో సాగర్ బుద్ధవనం వద్ద ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని కూడా అధికారులు తొలగించారు. యాదాద్రి ఆలయంలోని స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మను, కారు బొమ్మను చెక్కడం కలకలకం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై విపక్షాలు, హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.
బీజేపీ నేతలతో సహా పలువురు ఆలయాన్ని దర్శించి ఆందోళన చేపట్టడంతో అధికారులు స్తంభాలపై కేసీఆర్, కారు గుర్తులను తొలగించారు. మరోవైపు, తాజాగా సాగర్ బుద్ధవనం వద్ద ఉన్న కేసీఆర్ చిత్రాన్ని కూడా అధికారులు తొలగించారు. బుద్ధుడికి కేసీఆర్ పుష్పాంజలి ఘటిస్తున్నట్టు ఈ చిత్రాన్ని చెక్కారు. తాజా వివాదం నేపథ్యంలో ఇక్కడ కూడా కేసీఆర్ బొమ్మను తొలగించారు.
జేడీఎస్తో పొత్తుతో నష్టపోయాం..లేకుంటే 16 స్థానాల్లో గెలిచేవాళ్లం: వీరప్ప మొయిలీ