telugu navyamedia
రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఉత్తమ అధ్యాపకుల .. జాబితా.. 26 మందికి..

AP

ఏపీ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపకులుగా 13 మంది జూనియర్‌ లెక్చరర్లు, మరో 13 మంది పాలిటెక్నిక్‌ కళాశాల లెక్చరర్లను ప్రకటించింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్‌, ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్‌ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున వీరికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.

పాలిటెక్నిక్‌ కళాశాలకు సంబంధించి ప్రిన్సిపాల్‌ విభాగంలో ఎయు రీజియన్‌లో డాక్టర్‌ బి దేముడు, ఎస్వీయు రీజియన్‌లో ఎన్‌ఎస్‌ వెంకటేష్‌ కుమార్‌, వైసి జేమ్స్‌, హెచ్‌వోడీ విభాగంలో ఎయు రీజియన్‌లో వై వెంకటేశ్వరరావు, ఎస్వీయు రీజియన్‌లో డాక్టర్‌ ఎం శివరామకృష్ణలను ఎంపిక చేశారు.

సీనియర్‌ లెక్చరర్‌ విభాగం జోన్‌-1లో సిహెచ్‌ రాజు, జోన్‌-3లో డాక్టర్‌ ఎం డేవిడ్‌ రాజు, జోన్‌-4లో ఎస్‌కె బాదుషా ఎంపికయ్యారు. లెక్చరర్‌ విభాగంలో జోన్‌-1 కింద డాక్టర్‌ అనంతకుమార్‌, సి దుర్గాప్రసాద్‌, జోన్‌-3లో కె రత్నబాబు, జోన్‌-4లో డాక్టర్‌ జిఎస్‌ హరీష్‌, ఎ ధనాంజేయులు ఎంపికయ్యారు.

Related posts