ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేరుతో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి రానున్నదని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి అవసరమైన ఆదేశాలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్లకు ఇచ్చారు.
గ్రామ సచివాలయాల పేరుతో నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా సచివాలయ భవనాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులైన గ్రీన్, సియాన్, తెలుపు హంగులతో తీర్చిదిద్దుతున్నారు.పంచాయతీ భవనాలకు కూడా ఇదే విధమైన రంగులతో కొత్త హంగులు దిద్దాలని అధికారులు ఆదేశించారు.