భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. ఎస్పీజీకి బదులు ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.ఎస్పీజీ భద్రతను కొద్దిమందికే కల్పించనున్న క్రమంలో వార్షిక సమీక్షలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఎస్పీజీ భద్రత ప్రస్తుతం కేవలం నలుగురు అత్యున్నత రాజకీయ ప్రముఖులైన ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు మాత్రమే పరిమితమైంది. మన్మోహన్ సింగ్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. భద్రత విషయంలోకేంద్రం తీసుకున్న నిర్ణయం పై మన్మోహన్ ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు.

