వరుసగా ఆరో రోజూ దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి అర్ధగంటలో అమ్మకాలకు గురైయ్యాయి. దీంతో తుదకు సెన్సెక్స్ 16 పాయింట్లు నష్టపోయి 37,830కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 19 పాయింట్లు తగ్గి 11,252 వద్ద ముగిసింది. జూలై డెరివేటివ్ సిరీస్ గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహారించారు.
జిఎస్టి కౌన్సిల్ సమావేశ నిర్ణయాలు కోసం మార్కెట్ వర్గాల ఎదురుచూపులు, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒడిదుడుకుల ట్రేడింగ్ సూచీలు ఆరంభలాభాలు ఆవిరయ్యేందుకు కారణమయ్యాయి.