తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ కుంతియాపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు మరోసారి ఫైర్ అయ్యారు. ఇటీవల కొందరు సీనియర్ నేతలు పార్టీకీ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విషయాలను ప్రస్తావిస్తూ కుంతియాపై మండిపడ్డారు. రాష్ట్రంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఒకే న్యాయం ఉండే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా కుంతియా ఉన్నంత వరకు పార్టీ బాగుపడేదే లేదని ధ్వజమెత్తారు. బెదిరింపులకు పాల్పడే వారికే పార్టీలో ఎక్కువ అవకాశాలిస్తున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
previous post
బొత్స తానే సీఎంలా మాట్లాడుతున్నారు: పవన్ విమర్శలు