ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ యువనాయకుడు నారా లోకేశ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజాధనంతో అన్ని సౌకర్యాలు ఉన్న ఇళ్లను పేదవారికి కట్టించడం తప్పు అని మీరు అనడం సబబు కాదని అన్నారు. తమరు ఇప్పుడు ఏపీకి సీఎం అని, ఇకనైనా సాక్షి పేపర్ ను చదవడం మాని, పక్కన ఉన్న అధికారులతో మాట్లాడితే నిజాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. మీకు అది కూడా ఇష్టం లేకపోతే వివరాలు ఇవిగో అంటూ కొన్న వివరాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
‘సరదాగా కొంత సమయం గడపడానికి బెంగుళూరులో ప్యాలస్ నిర్మించుకోవచ్చు. అమరావతిలో నివాసం కోసం రాజ భవనం కట్టుకోవచ్చు. హైదరాబాదులో పాండ్ ను మింగి… లోటస్ లాంటి భవనాన్ని నిర్మించుకోవచ్చు. పేదవాడు మాత్రం కూలిపోయే ఇందిరమ్మ ఇళ్లలోనే ఎప్పుడూ ఉండిపోవాలి’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమి కాదు: చంద్రబాబు