ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగాయలంక మండలం కమ్మనమొలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో గ్రామంలోని 13 ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకొని లంకె గోపాలస్వామి(65) అనే వ్యక్తి మృతి చెందాడు.
సకాలంలో అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి రాకపోవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామలో విషాదఛాయలు అలముకున్నాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలడం బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆడుకోవాలని బాధితులు కోరుతున్నారు.