టాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్యవహారం బయటపెట్టి పలువురిపై సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొందరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా శ్రీరెడ్డి క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ పై హాట్ కామెంట్స్ చేసింది. ఇటీవల తాను విమానంలో ప్రయాణిస్తుండగా కీర్తి సురేష్ ని చూసిందట. ఆమెని ఎవ్వరూ పట్టించుకోలేదని తన వెంట పడ్డారని శ్రీరెడ్డి చెబుతోంది. కీర్తి సురేష్ కొత్త లుక్ పై శ్రీరెడ్డి మాట్లాడుతూ… సన్నగా అవడం వల్ల కీర్తి సురేష్ పేషంట్ లాగా మారింది. విమానంలో ఆమెని ఎవ్వరూ గుర్తించలేదు. అందరూ సెల్ఫీల కోసం నావద్దకు వచ్చారు అని శ్రీరెడ్డి తెలిపింది. కీర్తి సురేష్ ఇటీవల జిమ్ లో బాగా కసరత్తులు చేసి తన లుక్ మార్చుకుంది. కీర్తి సురేష్ బాగా సన్నబడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
previous post