ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన గ్యాస్ట్రో ఎంట్రొలోజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ లో ఉన్న తన నివాసానికి చంద్రబాబు వెళ్లారు.ఈ సందర్భంగా ఆయనను కలిసిన టీడీపీ నేతలు దాదాపు అరగంట సేపు ఆయనతో సమావేశమయ్యారు.
రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు, తాజా పరిణామాలపై వీరు చర్చించారు.టీటీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలు భేటీ అయ్యారు. సమావేశానంతరం మీడియాతో రావుల మాట్లాడుతూ ఎన్నికల ఓటమికి గల కారణాలను విశ్లేషించామని తెలిపారు. . రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.
కుంతియా అనే ఐరన్లెగ్ వల్లే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం: సర్వే