దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. రామ్చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తునారు. సముద్రఖని కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తారు. రెండు నిజమైన పాత్రల కల్పితగాథే ఈ చిత్రం. ఈ సినిమాని 2020, జూలై 30న విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు.
డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మూడో షెడ్యూల్కు ముందు రామ్చరణ్ జిమ్లో గాయపడటం.. ఎన్టీఆర్ గాయం తిరగబెట్టడంతో దాదాపు నెలరోజుల పాటు చిత్రీకరణ ఆపారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో జరుగుతుంది. ఇప్పటికే నెలరోజులు ప్లానింగ్లో వెనకపడటంతో తదుపరి షెడ్యూల్స్ను ఈ గ్యాప్ను పూర్తి చేసేలా ప్లాన్ చేయమని తన యూనిట్కు రాజమౌళి ఆదేశించినట్లు సమాచారం. ఈ ఏడాది చివరికి సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక పక్క ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. సినిమా షూటింగ్తో పాటు త్వరలోనే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ను కూడా స్టార్ట్ చేయబోతున్నారట. ఎందుకంటే వి.ఎఫ్.ఎక్స్ కారణంగా సినిమా ఆలస్యం కాకుండా చూడాలనుకుంటున్నారట యూనిట్ వర్గాలు.
పెళ్ళైన వ్యక్తితో సంబంధం… సంచలన విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్