ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ బాధ్యత లేని వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. “రణబీర్ కపూర్ లాంటి నటులు సమాజం పట్ల బాధ్యత లేదు. వాళ్ల ఇంటికి కరెంట్, నీరు నిరాటంకంగా అందుబాటులో ఉంటుంది. లగ్జరీ ఇళ్లలో ఉంటూ, మెర్సిడెస్ బెంజ్ కార్లలో తిరుగుతారు. ఇదంతా దేశ ప్రజల వల్ల వచ్చిందే. కానీ, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మాత్రం ఇలాంటి వారు ఇష్టపడరు. నేను అలాంటి వ్యక్తిని కాదు” అని వ్యాఖ్యానించింది. తాజాగా కంగనా వ్యాఖ్యలపై రణబీర్ స్పందించారు. “ప్రజలు వారికి నచ్చినట్టు మాట్లాడొచ్చు. నాకు ఎవరి నుంచైనా ప్రశ్నలు ఎదురైతే కచ్చితంగా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తా. కానీ, రాజకీయాల గురించి మాట్లాడాలనే ఆసక్తి లేదు. అనవసరంగా వివాదాల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. ప్రజలు ఎవరికి నచ్చిన కామెంట్లు వారు చెయ్యొచ్చు. కానీ, నేను ఎవరు, నేను దేని గురించి మాట్లాడాలి అనే విషయంలో నాకు క్లారిటీ ఉంది” అంటూ సమాధానమిచ్చారు రణబీర్ కపూర్. రణబీర్ వ్యాఖ్యలపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.
previous post


గాంధీజీపై కంగనా షాకింగ్ కామెంట్స్