కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది దుర్మరణం పాలవగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్దుర్తి క్రాస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయిన క్రూజర్, వోల్వో బస్సును ఢీకొట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలోని తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదం పెళ్లి చూపులకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగినట్టు తెలుస్తోంది. మృతులంతా గద్వాల జిల్లా పామవరం వాసులుగా గుర్తించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.