మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తుండగా.. అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబు, సుదీప్ సహా పలువురు ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల వేసిన భారీ సెట్ అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా విడుదల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తేదీన విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. దసరా సీజన్ ఉంటుంది కాబట్టి కలెక్షన్లకు ఇబ్బంది ఉండదని చిత్రయూనిట్ భావిస్తోందట.
previous post
next post
కాలం అనుకూలిస్తే ఆ పని కూడా చేస్తా… : ప్రియాంక చోప్రా