వంశీపైడిపల్లి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం “మహర్షి”. అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ సంగతి ఎలా ఉన్నా అదిరిపోయే ఓపెనింగ్స్తో రికార్డు కలెక్షన్లు రాబట్టింది. నైజాంలో “బాహుబలి-1” రికార్డును అధిగమించింది. ఈ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 24.6 కోట్ల షేర్ సాధించినట్టు పీఆర్వో బీఏ రాజు ట్విటర్ ద్వారా తెలిపారు. నైజాంలో “బాహుబలి-1” తొలి రోజు 6.28 కోట్లు వసూలు చేసింది. గురువారం విడుదలైన `మహర్షి` పది లక్షలు ఎక్కువగా 6.38 కోట్లు దక్కించుకుంది. వేసవిలో భారీ సినిమాలు లేకపోవడం, రేట్లు పెంపు వంటి అంశాలు, అదనంగా షోలు వేయడం వంటి కారణాలు `మహర్షికి` కలిసి వచ్చాయి.
అయితే ఇప్పుడు ‘మహర్షి’ మేకర్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది తమిళ రాకర్స్ వెబ్ సైట్. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్ డీ క్వాలిటీ పైరసీ ప్రింట్ ని తమ వెబ్ సైట్ లో రిలీజ్ చేశారు తమిళ రాకర్స్ నిర్వాహకులు. పైరసీ ఎఫెక్ట్ కచ్చితంగా కలెక్షన్లపై పడుతుందని నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. మరి పైరసీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.