BYJU’S ఆన్ లైన్ యాప్ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది. విద్యార్ధులు ఈ యాప్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. ఇది ఎడ్యుకేట్ యాప్. విద్యార్ధులకు అవసరమైన శిక్షణకు ఉపకరించే ఎడ్యుకేట్ కంపనీ బైజూస్ యాప్. ఇప్పుడు ఈ సంస్థ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో దృష్టి సారించింది. ఇందులో భాగంగా మహేష్ బాబుని ప్రచారకర్తగా నియమించింది. దీనికి సంబంధించిన యాడ్ లో మహేష్ బాబు నటించారు.
ఈ BYJU’S చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణా మార్కెట్లు తమకు ఎంతో కీలకమైనవిగా భావిన్నామని, యాప్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి నమోదవుతున్న విద్యార్ధుల సంఖ్య రోజురోజుకి బాగా పెరుగుతుందని, ఇప్పుడు మహేష్ బాబు ప్రచారం చేయడం ద్వారా తల్లితండ్రులకు, విద్యార్ధులకు మరింత చేరువ అయ్యేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ యాడ్ ను మీరు కూడా వీక్షించండి.