telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లతా మంగేష్కర్‌ ను పరామర్శించిన సీఎం ఉద్ధవ్

Latha-Mangeshkar

గాయని లతా మంగేష్కర్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా లతా మంగేష్కర్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం రాత్రి పరామర్శించారు. సౌత్ ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ చికిత్స తీసుకుంటున్నారు. ఉద్ధవ్ థాకరే బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న లతా మంగేష్కర్ నవంబర్ 11వ తేదీన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. లతా మంగేష్కర్ పలు భాషల్లో 30 వేల పాటలు పాడారు. 2001లో ఆమెకు భారతరత్న అవార్డు వరించింది.

Related posts