ఏపీ ఎంసెట్-2019 ప్రవేశ పరీక్ష ఇటీవల ముగియడంతో ఫలితాల విడుదలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష జరిపారు. ఎంసెట్ ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇంటర్ మార్కులను కూడా అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డును ఆదేశించారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్ కోసం మార్కులివ్వాలని సీఎస్ సూచించారు. ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు సీఎస్ ఆదేశించారు.
previous post