ఈసీ చేతిలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పావుగా మారారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను పావుగా చేసుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి బంగారంపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం దారుణమని విమర్శించారు.
విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు అయి ఉండి కూడా సభ్యత లేకుండా మాట్లాడటం దారుణమని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పసుపు-కుంకుమ డబ్బులు మహిళలకు అందకుండా సీఎస్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ప్రజలే తరిమి కొడతారని సాధినేని యామిని అన్నారు.
బలహీనవర్గాల గొంతు నొక్కేందుకే కౌన్సిల్ రద్దు తీర్మానం: చంద్రబాబు