చీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్ ఐపిఎల్లో బాగా రాణించిన వారికి వరల్డ్కప్ టీమ్లో అవకాశం దొరుకుతుందనే విషయంపై స్పష్టత ఇచ్చారు. ఐపిఎల్కు వరల్డ్కప్ టీమ్ ఎంపికకు సంబంధమే లేదని స్పష్టం చేశాడు. ఈ నెల 15న మెగా టోర్నీ కోసం టీమ్ను ఎంపిక చేయనున్నారు. ఐపిఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారనే వార్తలకు ఎమ్మెస్కే చెక్ పెట్టారు.
ఈ అంశంలో దాదాపు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయాన్నే ఎమ్మెస్కే వ్యక్తం చేశాడు. టీమ్లో నాలుగో నంబరు బ్యాట్స్మెన్పై సందిగ్ధత తొలగని కారణంగా ఇంకా టీమ్ సభ్యులను ప్రకటించలేదని అన్నారు. ఇప్పటికే తుది జట్టు ఎంపికపై సెలక్టర్లు ఓ అంచనాకు వచ్చేసినట్లు చీఫ్ సెలక్టర్ వెల్లడించారు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా షూటింగ్స్ చేయడం చాలా కష్టం : సి. కళ్యాణ్