సంజూ శామ్సన్ 2015లోనే భారతజట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఓ ఇంటర్నేషనల్ టీ 20 కూడా ఆడాడు. 7వ స్ధానంలో దిగి 19 రన్స్ చేశాడు. అంతే ఆ తర్వాత అతడిపై సెలక్టర్లు ఎందుకు వేటు వేశారో ఎవ్వరికీ అర్ధం కాలేదు. అప్పటి నుంచి తన కెరీర్లో ఎత్తుపల్లాలెన్నో చవిచూశాడు. సూపర్ క్రికెటర్గా ఎదిగాడు. కేరళ రంజీ జట్టు.. ఐపీఎల్లో రాజస్ధాన్ రాయల్స్లో కీలక సభ్యుడిగా మారాడు. కొన్నేళ్లుగా రంజీలు, ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న సంజుపై చాలామందికి భారీ అంచనాలే ఉన్నాయి. అతడి ఆటకు మాజీ క్రికెటర్లు ఫిదా అయ్యారు. విజయ్ హజారే ట్రోఫిలో డబుల్ సెంచరీ బాది సంచలనం సృష్టించడంతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు, ఏదో ఒక మ్యాచ్లోనైనా అవకాశం దక్కుతుందని ఊహించాడు. కానీ అతడి ఆశలు అడియాసలే అయ్యాయి. డ్రింక్స్ మాత్రమే అందించాడు. కనీసం వెస్టిండీస్తో టీ20 సిరీస్కైనా ఎంపిక చేస్తారేమోనని అనుకుంటే అదీ లేదు. ఎవరికైనా సరే ఓ అవకాశం ఇచ్చాకే వేటు వేయడం కనీస సంప్రదాయం. మరి సంజు శాంసన్ విషయంలో అదీ జరగలేదు. పదేపదే విఫలమవుతున్న రిషభ్ పంత్పైనే సెలక్టర్లు విశ్వాసం ఉంచారు. అతడు అద్భుతమైన ఆటగాడే. పరుగుల వేట మొదలుపెడితే ఆపడం ఎవరీ తరం కాదు. కానీ ప్రస్తుతం షాట్ల ఎంపికతో తరుచుగా ఫెయిల్ అవుతున్నాడు. స్ట్రైక్ ఇవ్వాలా, బాదాలా అన్న గందరగోళంలో ఉంటున్నా రిషబ్ పంత్కు ఎక్కువ అవకాశాలే ఇచ్చారు. కానీ సంజూ విషయంలో సెలక్టర్లు చిన్నచూపు చూస్తున్నారు.
బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదు: కేటీఆర్