కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘న్యాయ్’ పథకాన్ని ప్రకటించి హీరో అయ్యారని, నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రధాని మోదీ జీరో అయ్యారని విజయశాంతి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ 16 సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరి ఏపీలో 16 సీట్లు గెలిస్తేనే కేంద్రంలో చక్రం తిప్పేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, మరి అలా అయితే 22 సీట్లు గెలుస్తానంటున్న జగన్ ఏం తిప్పాలని కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు.
టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచార నినాదమైన ‘సారు, కారు, సర్కారు’ను విజయశాంతి ప్రస్తావిస్తూ.. ‘కేసీఆర్ సారు.. ప్రధాని ‘కారు’’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్.. జగన్ ఓ ఒప్పందానికి వచ్చినా… మమతా, మాయావతి వంటి సీనియర్ నేతలు కేసీఆర్ చెప్పు చేతల్లో పనిచేస్తారా..? అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ చక్రం తిప్పేదాకా జగన్ ఊరుకుంటారా? అని నిలదీశారు.
పృథ్వీ షా పై పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు…