telugu navyamedia
National క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దిల్లీ మద్యం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పై హైకోర్టు స్టే

ఢిల్లీ మద్యం కేసులో దిల్లీ రౌజ్​ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పై హైకోర్టు స్టే.

ఢిల్లీమద్యం కేసులో ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) అగ్రనేతలు అర్వింద్​ కేజ్రీవాల్​, మనీశ్​ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవితతో పాటు మిగతా ప్రతివాదులందరికీ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్​లో సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీ లోని రౌజ్​ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 23 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ ఫిబ్రవరి 27న ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ దర్యాప్తు సంస్థ అప్పీల్​ దాఖలు చేసింది.

దీనిపై దిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జరిపిన సీబీఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేసి, ఈ కేసుపై తగిన చర్యలు తీసుకోవాలని ట్రయల్​ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్​సింగ్​ జారీ చేసిన ఆదేశాలపై కోర్ట్​ స్టే ఇచ్చింది.

 

 


Related posts