ఢిల్లీ మద్యం కేసులో దిల్లీ రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పై హైకోర్టు స్టే.
ఢిల్లీమద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేతలు అర్వింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవితతో పాటు మిగతా ప్రతివాదులందరికీ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీ లోని రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 23 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ ఫిబ్రవరి 27న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ అప్పీల్ దాఖలు చేసింది.
దీనిపై దిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జరిపిన సీబీఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేసి, ఈ కేసుపై తగిన చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్సింగ్ జారీ చేసిన ఆదేశాలపై కోర్ట్ స్టే ఇచ్చింది.

