telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కోర్టు తీర్పు పై కవిత హర్షం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు నేడు భారీ ఊరట లభించింది.

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను మరియు ఇతర నిందితులను ఈ కేసు నుండి ( డిశ్చార్జ్) విముక్తి చేస్తూ తీర్పునిచ్చింది.

కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆమె సోషల్ మీడియా వేదికగా “సత్యమేవ జయతే” (నిజమే గెలిచింది) అని పోస్ట్ చేశారు.

తనపై పెట్టిన కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, మొదటి నుండి తాను ఇదే మాట చెబుతున్నానని ఆమె పునరుద్ఘాటించారు.

ఎన్ని అబద్ధాలు అల్లినా, చివరకు న్యాయవ్యవస్థ ముందు నిజం నిలబడిందని, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని కోర్టు స్పష్టం చేసిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కష్ట సమయంలో తనకు మరియు తన కుటుంబానికి అండగా నిలిచిన కార్యకర్తలకు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Related posts