telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బయో టాయిలెట్స్‌ బస్సులపై గులాబీ రంగును తొలగించాలి: కేసీఆర్ ఆదేశం

మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులకు వేసిన గులాబీ రంగుపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. బస్సులపై గులాబీ రంగును తొలగించాలని కేసీఆర్‌ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ను ఆదేశించారు. గురువారం ఉదయం సీఎం కేసీఆర్ మంత్రి అజయ్‌కు ఫోన్‌ చేశారు. సీఎం ఆదేశాలతో వెంటనే బస్సుల రంగులు మార్చాలని అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్‌ సూచించారు.

ఖమ్మంలోని ఎస్సార్‌ అండ్ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులను బుధవారం అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ బస్సులను మంత్రి అజయ్‌ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. 

Related posts