telugu navyamedia
National ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖపట్నం వేదికగా ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్, సిటీ పరేడ్‌కు హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

విశాఖపట్నం వేదికగా ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌), మిలాన్, సిటీ పరేడ్‌ నిర్వహినున్నారు. ఈనెల 18 నుంచి జరగనున్న కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరవుతున్నారు.

నేడు రాష్ట్రపతి, రక్షణ మంత్రి విశాఖపట్నం చేరుకుంటారు. రాష్ట్రపతి ఇవాళ సాయంత్రం 4.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరి విశాఖపట్నానికి చేరుకుంటారు.

మంగళవారం రాత్రికి సాగరతీర నగరంలో బసచేస్తారు. 18వ తేదీ ఉదయం విశాఖపట్నంలో జరిగే ఐఎఫ్‌ఆర్‌ కార్యక్రమంలో పాల్గొంటారు, అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖపట్నం పర్యటనకు వెళునున్నారు.. ఆయన రాష్ట్రపతి, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి నగరంలో జరిగే ఐఎఫ్‌ఆర్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.

విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో ఐఎఫ్‌ఆర్‌ సందర్భంగా నౌకాదళం ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 18న ఫుల్‌డ్రెస్‌ రిహార్సల్స్, 19న సిటీ పరేడ్‌ జరగనుంది. వీఐపీల రాకతో విశాఖపట్నం సందడిగా మారింది. విశాఖపట్నంలో ఐఎఫ్‌ఆర్‌-2026, మిలన్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమం లో 65 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మన దేశ యుద్ధ నౌకలు, నేవీ సామర్థ్యంతో పాటుగా వివిధ దేశాల నౌకలను దగ్గరి నుంచి చూసే అవకాశం ఉంటుంది.

Related posts