telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరు: మురళీమోహన్

Murali Mohan Comments Filim Industry

ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరని టీడీపీ నేత మురళీమోహన్ వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లను తెలంగాణ సీఎం కేసీఆర్ భయపెడుతున్నారన్నది నిజం కాదని తెలిపారు. రాజమండ్రిలో ఈరోజు టీడీపీ తరఫున మురళీ మోహన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెదిరించడం వల్లే తాను పోటీ నుంచి తప్పుకున్నానని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.తన ట్రస్టు కార్యకలాపాలు చూసుకోవడానికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు మురళీమోహన్ తేల్చిచెప్పారు.

అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డికే ఎదురుతిరిగి నిలబడ్డాననీ, 18 ఎకరాల భూమి పోయినా లెక్కచేయలేదని మురళీ మోహన్ గుర్తుచేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తన కోడలు మాగంటి రూపను టీడీపీ తరఫున బరిలోకి దించే విషయమై ఆలోచిస్తున్నట్లు మురళీ మోహన్ తెలిపారు. 

Related posts