telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం చేసింది: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన జనరల్ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి వైసీపీ మహాపరాధం చేసిందని ఆయన ఆరోపించారు.

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, అయినా వైసీపీ విష ప్రచారం చేస్తోందని విమర్శించారు.

రసాయనాలు, పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఆరోపించారు.

కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? అనే విషయాన్ని సిట్ బహిర్గతం చేయలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు.

అయితే తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు .

‘లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? అని పార్టీ మీటింగ్‌లో నేతలకు సూచించారు.

Related posts